లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై

TBN LIVE
తిమ్మాజిపేట ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎస్సె పట్టుబడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి ఈనెల 07న ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 30 వేలు డిమాండ్ చేసి రూ. 20వేలు లంచం తీసుకున్న నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఎస్సె హరిప్రసాద్ రెడ్డి నీ సోమవారం మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.ఇసుక కొడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్, జేసీబీని పట్టుకొని ఈనెల 5వ తేదీన ఎస్సె హరి ప్రసాద్ రెడ్డి కేసు నమోదు
చేసి వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా మైనింగ్ అధికారులకు తెలిపారు. మైనింగ్ అధికారులు ఆ
వాహనాలకు రూ. 60 వేలు ఫైన్ వేశారు. ఈ డబ్బులను
ఈనెల 7వ తేదీన చెల్లించి వాహనాల రిలీజ్ కోసం
పత్రాలను తెచ్చి ఎస్సైకి ఇచ్చాడు. రూ. 30 వేలు ఇస్తేనే
వాహనాలను విడుదల చేస్తాను అని ఎస్సె చెప్పాడు.
మైనింగ్ ఫైన్ కట్టడంతో పాటు.. మళ్లీ రూ. 30 వేలు
కట్టవలసి రావడంతో వాయిస్ రికార్డింగ్ లు.. 20వేల
రూపాయలు చెల్లించిన అంశాలతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అన్ని ఆధారాలతో ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్ స్టేషన్ కు చేరుకొని
ఎస్సెని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు
నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు DSP బాలకృష్ణ
వెలడించారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!