ఘనంగా స్వయం పాలన దినోత్సవం వేడుక
February 19, 2026
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం: తంగళ్ళపల్లి గ్రామ ప్రైమరీ స్కూల్ లో గురువారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కటి పాఠాలు బోధించారు. వారి బోధన చూస్తూ పాఠశాల యజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించినందుకు విద్యార్థిని విద్యార్థులు ఆనందం లో మునిగిపోయారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు వసుంధర మండల ఎం,ఈ,ఓ మంజుల దేవి, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్, ఉపాధ్యాయురాలు మధుమిత ,స్కూల్ కాంప్లెక్స్ అనంతప్ప, పంచాయతీ కార్యదర్శి జాంగిర్ గ్రామంలోని పెద్దలు పాల్గొన్నారు.
Tags
