జడ్చర్ల మండలంలో ని పలు గ్రామాల్లో జిల్లా ఎస్పీ డి. జానకి పర్యటించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గంగాపూర్ , కోడుగల్ గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించి బందోబస్తును పర్య వేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
