ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశం
November 06, 2025
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ని చంద్ర గార్డెన్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రెండు ఉమ్మడి జిల్లాల మండల ఇంచార్జ్ నాయకులు గురువారం సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు వారు సమావేశం గూర్చి మాట్లాడుతూ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి పై జరిగిన అనాగరిక దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న చలో ఢిల్లీ సమాయత్తానికి అందరూ సిద్ధం కావాలని మందకృష్ణ మాదిగ తెలియజేశారు అంతేకాకుండా ఉద్యమం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న కొందరి ఇన్చార్జిల క్రమబద్ధతపై మండిపడుతూ ఉద్యమం పట్ల నిబంధత లేని నాయకత్వం వహిస్తే వారిపై వారిని ఉపేక్షించేది లేదు అని జడ్చర్ల చంద్ర గార్డెన్ టేబుల్ సమావేశంలో ఈ సందర్భంగా తెలియజేశారు.
Tags
