పోలీసుల ఆధ్వర్యంలో మత్తు మద్యం నిషేధం పట్ల యువతకు అవగాహన
November 03, 2025
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీసుల ఐపీఎస్ డి జానకి షీ టీం జడ్చర్ల సిఐ కమలాకర్ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో జడ్చర్ల లోని ఆర్కే గార్డెన్లో సోమవారం యువతి యువకులకు మద్యం మత్తు పట్ల అలాగే చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పోలీసుల కళాబృందం చేత మంచి స్ఫూర్తిని పెంచే మంచి పాటల కథల రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పోలీస్ అంటే భయం పోవాలి భయం వేసినప్పుడు పోలీసు గుర్తుకు రావాలి అనే భావన సూచనలు వివరించారు జిల్లా ఎస్పీ సూచన మేరకు పిల్లలను 6 సంవత్సరాల వరకు ప్రేమతో బాధ్యతతో పెంచాలి ఆరు నుంచి 16 సంవత్సరాల మధ్య వయసులో పిల్లలకు తల్లిదండ్రుల చిన్న చిన్న పనులతో తెలుపుతూ తల్లిదండ్రుల వ్యాపారాల్లో భాగస్వాములుగా చూడాలి అప్పుడే పిల్లలు ఏ చెడు అలవాట్లకు బానిస కారు అనే సూచనలు చేశారు.
Tags
