మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ సేవల శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అగ్నిమాపక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (SFO) పి. రాజేందర్ అగ్నిమాపక పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అగ్నిమాపక సిబ్బందిని స్మరిస్తూ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్చర్ల సీఐ కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రజలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు.
