కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం కక్ష పూరిత చర్యల్లో భాగమే రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకలను అణచివేసే కుట్ర చేస్తున్నాడు తెలంగాణలో తాజా పరిణామాల పైన కేటీఆర్ & వారి కుటుంబం పై కక్షసాధింపు రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాను, తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ నొక్కుతున్నారు. ఫార్ములా ఈరేస్ విషయంలో రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికము. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న బడా బాయ్ చోట బాయ్ బీజేపీ కాంగ్రెస్ చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు,అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొంటున్న.కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది,రేవంత్ రెడ్డి దుర్మార్గమైన వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్న,నాయస్థానాలమీద మాకుపూర్తి నమ్మకముంది ఫార్ములా ఈ రేసు పారదర్శకతతో నిర్వహించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన ఫార్ములా ఈ రేసు విషయంలో కేటీఆర్ను ఇరికించడం అన్యాయం KTR ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపుతున్నందుకు,స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కేటీఆర్పై కుట్ర చేస్తున్నారు.
ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాము.
