జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తా జంక్షన్ దగ్గర రేపు శనివారం సాయంత్రం 7:00pm గంటల కు జరుగు సదరు ఉత్సవాలలో బాగంగ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు గిరి యాదవ్ ,కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ సంఘ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం జరిగే సదరు ఉత్సవంలో పట్టణ ప్రజలతో పాటు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీలు శ్రీమతి డికె అరుణ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్,అంజయ్య యాదవ్ మహబూబ్నగర్ ముడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు కావున పట్టణ ప్రజలు సకాలంలో ఈ కార్యక్రమం నందు పాల్గొని సదరు ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కమిటీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బాగంగ విశ్వేశ్వర్ యాదవ్, శ్రీశైలం యాదవ్,వంగూరు నరసింహ యాదవ్, అధ్యక్షుడు గిరి యాదవ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు మచ్చల శ్రీను యాదవ్, కృష్ణయ్య యాదవ్, కుంభం కృష్ణ యాదవ్, ప్రభాకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
