(జడ్చర్ల ) నవాబు పేట్ మండలం పరిధిలో ఉన్న యన్మన్ గండ్ల గ్రామం చెందిన సాకలి జగదీష్ వయసు 28 బుధవారం అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ గౌడ్, అనే వ్యక్తి ఆయన పంట పొలానికి నర్సరీ నుండి చెట్లు తీసుకొని పంట పొలానికి దింపడానికి వెళ్లగా పొలం ఆవరణంలో చెట్ల మధ్య విద్యుత్ వైర్లు బులోరా వాహనానికి అడ్డురాగా వైర్లను తప్పిస్తున్న తరుణంలో ప్రమాదాశరత్తుగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడుతో పాటు ఉన్న నలుగురు వ్యక్తులు ఉండగా షాక్ రావడంతో ప్రమాదంలో తప్పించుకున్నారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . బులోరా వాహనం నడుపుతూ జీవనం కొనసాగించేవాడు మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నియమితం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
